ఏప్రిల్ 20, 2016
రిజర్వ్ బ్యాంక్చే " L" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 100 విలువగల బ్యాంకు నోట్లు జారీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్-2005 క్రింద మూడు అదనపు/ సవరించిన అంశాలుగల, ₹ 100 విలువగల బ్యాంక్ నోట్లు జారీ చేస్తుంది. ఈ నోట్లు రెండు నంబర్ ప్యానెల్స్ లో "L” అక్షరం నిగూఢంగా కలిగి, డా. రఘురామ్ రాజన్, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్చే సంతకం చేయబడి ఉంటాయి. ముద్రించిన సంవత్సరం "2015" నోటు వెనుకవైపు ముద్రించబడి ఉంటుంది.
ఈనోట్ల నమూనా, అన్ని రకాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన ₹ 100 నోట్ల వలెనే ఉంటుంది. అయితే, ఈ నోట్లు, ముందువైపు రెండు నంబర్ ప్యానెళ్ళలో ఉన్న సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉండి, బ్లీడ్ లైన్స్, పెద్దదిగా ఉన్న గుర్తింపు చిహ్నం కలిగి ఉంటాయి. ఈ మూడు అంశాలు గల, ఇటువంటి ₹ 100 బ్యాంక్ నోట్లు (నిగూఢంగా ఉన్న అక్షరం మారుతుంది) ఇంతకు ముందే చెలామణిలోకి తేబడ్డాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆరోహణక్రమంలో సంఖ్యలు కలిగి, బ్లీడ్ లైన్స్, పెద్ద గుర్తింపు చిహ్నంలేకుండాఉన్న, ₹ 100 నోట్లు కూడా జారీ చేసింది. ఈ నోట్లు ప్రస్తుతం జారీ చేసిన బ్యాంక్ నోట్లతోబాటు చలామణిలో ఉంటాయి.
ఇంతకు పూర్వం జారీ చేసిన అన్ని ₹ 100 బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2015-2016/2454 |