| రాయ్ పూర్లో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్ బీ ఐ |
ఏప్రిల్ 17, 2017
రాయ్ పూర్లో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్ బీ ఐ
ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ నెట్ వర్క్ గణనీయంగా పెరగడం వల్ల మరియు ప్రస్తుతం భొపాల్ లోఉన్న బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ కార్యాలయం పరిధి చాలా పెరిగిపోయిందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాయ్ పూర్ నందు బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ కార్యాలయాన్ని నెలకొల్పింది.
ఇప్పటివరకు బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్, భొపాల్ కార్యాలయ పరిధిలో ఉన్న చత్తీస్ గఢ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాయ్ పూర్ నందు ఉన్న బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ కార్యాలయ పరిధిలోకి వస్తుంది.
శ్వేత మొహిలే
సహాయ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2016-2017/2798
|
|