మార్చ్ 05, 2018
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీచేయబడిన ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి’ (KYC) మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై ఫిబ్రవరి 27, 2018 న 20 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది.
ఈ చర్య, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు.
నేపథ్యం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యొక్క ఒక శాఖలో మోసం జరిగినట్లు గుర్తించడమైనది. మోసానికి సంబంధించి ఆ శాఖ దస్తావేజులు /అంతర్గత తనిఖీ నివేదిక మొదలైనవాటిని పరీశీలించిన తరువాత భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీచేయబడిన ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి’ (KYC) మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో బ్యాంకు విఫలమైనదని నిర్ధారించబడింది. దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది.
బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్ర్
పత్రికా ప్రకటన: 2017-2018/2355 |