తేదీ: 19/05/2018
పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్., నాసిక్, మహారాష్ట్ర ఫై
భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాల (డైరెక్షన్స్) విధింపు
మే 18, 2018 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-7/12.22.395/2017-18 ద్వారా పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్., నాసిక్, మహారాష్ట్ర ను భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాల క్రింద ఉంచింది. ఈ నిర్దేశాల ప్రకారం, ప్రతి డిపాజిటుదారు పొదుపు బ్యాంకు లేదా కరెంట్ అకౌంట్లో లేదా మొత్తం డిపాజిట్ ఖాతా నుండి కేవలం ₹ 1000 (రూ. ఒక వేయి రూపాయలు మాత్రమే) తీసుకోవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా, పద్మశ్రీ డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, నాసిక్, మహారాష్ట్ర, ఎటువంటి రుణాలను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, ఏదైనా పెట్టుబడులను పెట్టడం, ఎటువంటి బాధ్యతను అంటే నిధులను అప్పుతెచ్చుకోవడం, మరియు తాజా డిపాజిట్లను ఆమోదించడం, మరియు తన చెల్లింపు బాధ్యతల మొత్తాలనించి వేరే చెల్లింపుల పంపిణీకి వొడంబడటం లేదా ఏదైనా రాజి లేక పరిష్కార ప్రయత్నాలు చేయడం, తన ఆస్తులను బదలాయించడం లేదా అమ్మడం మొదలగు కార్యకలాపాలు, మే 18, 2018 నాటి ఆర్బిఐ నిర్దేశాల ప్రకారం నోటిఫై చేస్తే తప్ప , చేయరాదు. మే 19, 2018 పని వేళలు ముగిసే సమయం నుండి ఈ నిర్దేశాలు జారీ చేయబడ్డాయి.
జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా దీన్ని భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను పరిస్థితుల మీద ఆధారపడి పరిగణించవచ్చును
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) క్రింద సంక్రమించిన ఈ నిర్దేశాలు జారీచేయబడ్డాయి. నిర్దేశాల యొక్క నకలు, బ్యాంకు యొక్క ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/3044 |