అక్టోబర్ 31, 2018
డా. అంబేద్కర్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్, గ్వాలియర్, మధ్యప్రదేశ్ పై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో డా. అంబేద్కర్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్ , గ్వాలియర్, మధ్యప్రదేశ్ పై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 27 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనలను మరియు ‘పర్యవేక్షణా చర్యల చట్రం’ క్రింద విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందులకు ₹ 50,000/- (యాభైవేల రూపాయలు) నగదు జరిమానా విధించింది.
2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం దాఖలు చేసింది. ఈ సందర్భంగా నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం మరియు మౌఖిక వినతిని పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, బారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1008 |