తేదీ: 13/02/2019
ది కరీమ్నగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., కరీమ్ నగర్, తెలంగాణా
– జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A (1)(c) [సబ్ సెక్షన్ (4), సెక్షన్ 46 తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్, ది కరీమ్నగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., కరీమ్నగర్, తెలంగాణాపై, రూ. 50,000/- (ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. అమలు నివేదికకు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాలు/సూచనలు/ఆదేశాలు ఉల్లంఘించిన కారణంగా , జరిమానా విధించడమైనది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1927 |