తేది: 17/09/2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A
క్రింద నిర్దేశాలు – పద్మశ్రీ డా. విఠల్ రావ్ విఖె పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్,
మహారాష్ట్ర – కాలపరిమితి పొడిగింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A, సబ్-సెక్షన్(1) (సెక్షన్ 56తో కలిపి) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ప్రజాక్షేమం దృష్ట్యా, పద్మశ్రీ డా. విఠల్ రావ్ విఖె పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్, మహరాష్ట్రకు, మే 19, 2018 పనివేళల ముగింపునుండి, నిర్దేశాలు జారీచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈనిర్దేశాల కాల పరిమితి, మరొక ఆరు నెలల పాటు, అనగా సెప్టెంబర్ 18, 2019 నుండి మార్చ్ 17, 2020 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించినది. ఈ నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, పద్మశ్రీ డా. విఠల్ రావ్ విఖె పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడింది. పరిస్థితులనుబట్టి, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన రిజర్వ్ బ్యాంక్, వారి లైసెన్సును రద్దుచేసినట్లు భావించరాదు. బ్యాంకు, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలకు కట్టుబడి, బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/717
|