తేదీ: 16/10/2019
ఎస్.బి.ఎం బ్యాంకు (ఇండియా) లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
ఎస్.బి.ఎం బ్యాంకు (ఇండియా) లిమిటెడ్ ఫై అక్టోబర్ 15, 2019 నాటి ఆదేశం ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ), ₹ 3 కోట్ల జరిమానా, అనుపాలన ఉల్లంఘన కొరకు విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i), కలిపి, సెక్షన్ 47A(1)(c)లో ఆర్.బి.ఐ కి సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, "SWIFT- సంబంధిత కార్యాచరణ నియంత్రణల యొక్క సమయ-అమలు మరియు బలోపేతం", “బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్” ఫై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాల యొక్క కొన్ని నిబంధనలలో ఎస్.బి.ఎం బ్యాంకు (మారిషస్) లిమిటెడ్ (ఎస్.బి.ఎం బ్యాంకు (ఇండియా) తో విలీనమైంది) అనుపాలన ఉల్లంఘన కొరకు విధించడం జరిగింది.
ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు.
నేపథ్యం
ఆర్.బి.ఐ ద్వారా జరిపిన ఒక పరిశీలనలో ఎస్.బి.ఎం బ్యాంకు (మారిషస్) లిమిటెడ్ యొక్క ఇండియా కు సంబంధించిన SWIFT- సంబంధిత కార్యకలాపాల్లో ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాల యొక్క కొన్ని నిబంధనలలో అనుపాలన ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. కనుగొన్న సమచారం ఆధారంగా, ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని ఎస్.బి.ఎం బ్యాంకు (ఇండియా) కు నోటీసు జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/967 |