తేదీ: 25/10/2019
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు
బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీ చేసిన “భారతీయ రిజర్వు బ్యాంకు (వాణిజ్య బ్యాంకులు మరియు ఎంపిక చేసిన ఆర్ధిక సంస్థలు) ఆదేశాలు 2016” పై జారీచేసిన కొన్ని ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న కారణంగా, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు లిమిటెడ్ ఫై అక్టోబర్ 24, 2019 నాటి ఆదేశం ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు, ₹35 (ముప్పై ఐదు) లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i)తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లో ఆర్.బి.ఐ కి సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని విధించడమైనది.
ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు.
నేపథ్యం
మార్చ్ 31, 2017, ఆర్ధిక సంవత్సరానికి జరిగిన బ్యాంకు యొక్క చట్టబద్ధమైన తనిఖీలో మిగతా వాటితో కలిపి, “భారతీయ రిజర్వు బ్యాంకు (వాణిజ్య బ్యాంకులు మరియు ఎంపిక చేసిన ఆర్ధిక సంస్థలు) ఆదేశాలు 2016” పై ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం మరియు వ్యక్తిగత విచారణలో సమర్పించిన మౌఖిక నివేదనలు పరిగణించిన అనంతరం, జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన వాస్తవమని నమ్ముతూ, జరిమానా విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు రావడం జరిగింది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1038 |