జనవరి 23, 2023
సమర్థ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, షోలాపూర్ (మహారాష్ట్ర) పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
సమర్థ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, షోలాపూర్ (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై, పట్టణ సహకార బ్యాంకులకు (UCB లకు) వర్తించే ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ సంబంధిత విషయాలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, RBI జనవరి 16, 2023 నాటి ఉత్తర్వు ద్వారా, ₹.1.50 లక్షలు (ఒక లక్ష మరియు యాభై వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.
నేపధ్యము
బ్యాంక్ యొక్క మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక, మిగతావాటితో కలిపి, బ్యాంక్ IRAC నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట ఖాతాలను నిరర్థక ఆస్తులుగా వర్గీకరించలేదని మరియు నిర్ధారించిన కేటాయింపులు జరుపలేదని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు అపరాధ రుసుము ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.
బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరములు మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా IRAC నిబంధనలపై RBI జారీ చేసిన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/1595 |