ఫిబ్రవరి 20, 2023
ది జల్గావ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జల్గావ్ (మహారాష్ట్ర)పై
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 14, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “మీ వినియోగదారులను తెలుసుకోండి (KYC)” అనే విషయంపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, ది జల్గావ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జల్గావ్ (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై ₹1,50,000/- (ఒక లక్షా యాభైవేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.
నేపథ్యo
మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంక్ యొక్క తనిఖీ రిపోర్ట్, మిగతావాటితోపాటు, బ్యాంక్ పైన పేర్కొన్న RBI ఆదేశాలను పాటించకుండా/ విరుద్ధంగా తన కస్టమర్ల రిస్క్ వర్గీకరణను నిర్వహించలేదని వెల్లడించింది. దీని ఆధారంగా, RBI ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది.
బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరములు, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, RBI ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2022-2023/1749 |