తేది: 02/05/2023
ధూలే మరియు నందుర్బార్ జిల్హా సర్కారీ నొకరాంచీ సహకారి
బ్యాంక్ లిమిటెడ్, ధూలే (మహారాష్ట్ర)పై భారతీయ రిజర్వు
బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఏప్రిల్ 27, 2023 నాటి ఆదేశం ద్వారా, ధూలే మరియు నందుర్బార్ జిల్హా సర్కారీ నోకరంచి సహకారి బ్యాంక్ లిమిటెడ్, ధూలే (మహారాష్ట్ర)పై ₹1.00 లక్ష (రూ. ఒక లక్ష మాత్రమే) జరిమానా విధించింది. నగర సహకార బ్యాంకులకు ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలు - మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC)ల ఉల్లంఘనకు ఫై జరీమానా విధించడం జరిగింది. ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు.
నేపధ్యము
మార్చి 31, 2021 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించిన నష్టభయ అంచనా నివేదిక, మిగతావాటితో సహా వెల్లడి చేసినదాని ప్రకారము (i) నష్టభయ వర్గీకరణ ప్రకారం ఖాతాల కాలానుగుణ సమీక్షను నిర్వహించలేదు (ii) నష్టభయ వర్గీకరణ ప్రకారం దాని వినియోగదారుల KYC యొక్క కాలానుగుణ నవీకరణను నిర్వహించలేదు మరియు, (iii) అనుమానాస్పద లావాదేవీలను పర్యవేక్షించడానికి మరియు నివేదించడానికి హెచ్చరికలను రూపొందించడానికి ఎటువంటి వ్యవస్థ ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు అనుకూలంగా లేదు. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.
బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/164 |