తేది: 18/12/2023
ది కొంటాయి సహకారి బ్యాంకు లిమిటెడ్,పూర్బా మేదినీపూర్ జిల్లా, పశ్చిమ
బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధింపు
పట్టణ సహకార బ్యాంకుల లో, భారతీయ రిజర్వు బ్యాంకు 2016 లో విడుదల చేసిన “మీ ఖాతాదారుల గురించి తెలుసుకోండి” (KYC నిబంధనలు-2016) లను ఉల్లంఘించినందులకు గాను ది కొంటాయి సహకారి బ్యాంకు లిమిటెడ్,పూర్బా మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ పై పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 23నవంబర్, 2023 ద్వారా ఆర్ధిక రు.1.00 లక్ష (అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె) ఆర్ధక జరిమానా (పెనాల్టీ) విధించింది
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది
చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు.
నేపధ్యము
ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు(i) నిర్దుష్ట కాల పరిమితులలో ఖాతాలను రిస్క్ ఆధారంగా వర్గీకరించే విధానాన్ని బ్యాంకులో అమలు చేయక పోవుటను గమనించి, ఈ విషయములో భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది.
ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/1504 |