తేదీ: 28/12/2023
పశ్చిమ బెంగాల్లోని నాబాద్వీప్లో గల శ్రీ చైతన్య సహకార బ్యాంకు లిమిటెడ్పై
ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధించింది.
పశ్చిమ బెంగాల్లోని నాబాద్వీప్లో గల శ్రీ చైతన్య సహకార బ్యాంకు లిమిటెడ్పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బి ఐ) 2023 నవంబర్ 30న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5,000(కేవలం రూ.5 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘క్రెడిట్ సమాచార కంపెనీల (సీఐసీల) సభ్యత్వం’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను విధించింది. క్రెడిట్ సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005 (సీఐసీ యాక్ట్)లోని సెక్షన్ 23(4), సెక్షన్ 25(1)(iii) కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.
నేపథ్యం
2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టపరమైన తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీ నివేదికలో, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో నాలుగు సీఐసీలలో ఏ ఒక్క సభ్యత్వాన్ని పొందడంలో కూడా బ్యాంకు విఫలమైందని వెలుగులోకి వచ్చింది. దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ.. శ్రీ చైతన్య సహకార బ్యాంకు లిమిటెడ్కు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది.
షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు శ్రీ చైతన్య సహకార బ్యాంకు లిమిటెడ్పై ద్రవ్య జరిమానా విధించదగినదేనని నిర్ధారణకు వచ్చింది.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/1558 |