తేది: 08/01/2024
ది సుబ్రమనియ నగర్ పట్టణ సహకార బ్యాంకు సేలం తమిళనాడు పై భారతీయ
రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధింపు
పాలక వర్గ సభ్యులు –పట్టణ సహకార బ్యాంకులు పై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు, మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు, "తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు ఉల్లంఘించినందుకు ది సుబ్రమనియ నగర్ పట్టణ సహకార బ్యాంకు సేలం తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 19/12/2023 ద్వారా రు.25,000 వేల (అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు మాత్రమె) జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీ ల ప్రామాణికతలకు సంబంధించినది కాదు.
నేపధ్యము
ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీ నివేదికను, ముప్పు (రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట సదరు బ్యాంకు డైరెక్టరు యొక్క బంధువు కి ఋణము మంజూరు చేయడము జరిగిందని గమనించి, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/1635 |