తేదీ: 08/02/2024
నవనిర్మాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, గుజరాత్ వారిపై
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
“డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలు/స్తాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు” మరియు ‘డైరెక్టర్లకు ఋణాలు, అడ్వాన్సులు వగైరా –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 19, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నవనిర్మాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, (బ్యాంక్), గుజరాత్ వారి పై రూ. ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది.
ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.
నేపథ్యం:
మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని (నిర్దిష్ట పరిధి) నిర్వహించింది. ఈ పరిశీలన బాగంగా తనిఖీ నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు డైరెక్టర్ యొక్క బంధువు పూచికత్తుగా/హామీదారుగా ఉండడం వలన ఋణ సౌకర్యం కల్పించబడిందన్న విషయం వెల్లడైనది. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం మరియు అట్టి నిర్దేశాలకణుగునంగ బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన తరువాత, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు, షరతుల ఉల్లంఘనలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
(యోగేష్ దయాళ్)
చీఫ్జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/1835 |