తేదీ: 26/03/2024
కర్నాటకలోని చిక్కమగళూరులో గల చిక్కమగళూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
కర్నాటకలోని చిక్కమగళూరులో గల చిక్కమగళూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(యాభై వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘మోసాల – వర్గీకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాల’పై నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్.బి.ఐ ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.
2023 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న నాబార్డ్ దానిపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. నాబార్డ్ జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని గుర్తించడంతో పాటు, సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా.. మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ చిక్కమగళూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేయడమైంది.
షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ.. మోసాలను నాబార్డ్కు నివేదించడంలో ఆలస్యం చేయడాన్ని కొనసాగించినట్లు గుర్తించింది. దీంతో, ఈ బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.
(యోగేష్దయాళ్)
చీఫ్జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/2122 |