Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (279.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 27/03/2024
తమిళనాడులోని రాజపాళయంలో గల రాజపాళయం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

తేదీ: 27/03/2024

తమిళనాడులోని రాజపాళయంలో గల రాజపాళయం సహకార పట్టణ బ్యాంకు
లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

తమిళనాడులోని రాజపాళయంలో గల రాజపాళయం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.75,000(డెభై ఐదు వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సుల విషయంలో యూసీబీల బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిబంధనలు’, ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనలకు’ సంబంధించి ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

2022 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్‌‌.బి.ఐ మార్గదర్శకాలను అనుసరించడంలో బ్యాంకు విఫలమైందని గుర్తించడంతో పాటు, సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా.. తాము జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రాజపాళయం సహకార పట్టణ బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, ద్రవ్య జరిమానా విధించేలా కింద పేర్కొన్న అభియోగాలు వాస్తవమని గుర్తించింది. బ్యాంకు (i) డైరెక్టర్ల బంధువులకు రుణాలను జారీ చేసిందని (ii) నిర్దేశిత పరిమితికి మించి నామినల్ మెంబర్లకు రుణాలను మంజూరు చేసిందని ఆర్.బి.ఐ గుర్తించింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే ఏ ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(యోగేష్దయాళ్)
చీఫ్జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023‌-2024/2137

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….